రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మ్యాడమ్ బాలకృష్ణ

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మ్యాడమ్ బాలకృష్ణ

ముద్ర ప్రతినిధి, మెదక్: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మ్యాడమ్ బాలకృష్ణ కొనియాడారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్, మాజీ కౌన్సిలర్ విక్రమ్, సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, సంజీవ్, జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ సల్మాన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ చౌదరి, జాకీర్, శ్రీకాంత్, అమీర్, ఫుర్ఖన్ తదితరులు పాల్గొన్నారు.