Revanth Reddy: కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీ సీఎంను కలుస్తా: రేవంత్ రెడ్డి

Revanth Reddy: కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీ సీఎంను కలుస్తా: రేవంత్ రెడ్డి

కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం

రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని వెంకన్నను కోరుకున్నట్లు వెల్లడి

కొత్త సీఎంతో సత్సంబంధాలతో సమస్యలు పరిష్కరించుకుంటామని వివరణ


రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పారు. గతేడాది కొంత కరవు పరిస్థితి నెలకొన్నా ఈసారి మాత్రం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, ప్రభుత్వానికి ప్రకృతి సహకరిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా, పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సత్రం నిర్మించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిని కలిసి దీనిపై చర్చిస్తామని చెప్పారు. తిరుమలలో సత్రంతో పాటు కుదిరితే కల్యాణమండపం కూడా నిర్మించి స్వామి వారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు.