తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం 10 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, నిన్న స్వామివారిని 68,563 మంది భక్తులు దర్శించుకోగా.. 21,956 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.