నేడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్...!

నేడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్...!

ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 8 స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం ఇవాళ అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ హాజరుకానున్నారు.