TSPSC paper leak Updates టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై కొనసాగుతున్న ఈడీ విచారణ
![TSPSC paper leak Updates టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై కొనసాగుతున్న ఈడీ విచారణ](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_644fb520b6f48.jpg)
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై ఈడీ విచారణ కొనసాగుతోంది. జనార్ధన్ రెడ్డి, అనితా రామచంద్రన్ను ఈడీ విచారిస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీల వాంగ్మూలాలు ఈడీ నమోదు చేసింది. ఆరు గంటలపాటు ఇద్దరి వాంగ్మూలాలు ఈడీ నమోదు చేసింది. పేపర్ లీక్, కస్టోడియల్ సెక్షన్ ఆఫీస్వివరాలు ఈడీ నమోదు చేస్తోంది. ఉద్యోగుల పనితీరు, పరీక్షల నిర్వహణ అంశాలపై ఈడీ ఆరా తీస్తోంది. విదేశీయుల జాబితా వివరాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ కు చెందిన పలువురు అధికారులను సైతం ఈడీ అధికారులు విచారిస్తున్నారు.