హైదరాబాద్ Vs ముంబై మ్యాచ్కి సర్వం సిద్ధం
ముద్ర,తెలంగాణ బ్యూరో:- నేడు ఉప్పల్లో జరిగే హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్కి స్టేడియంలో 2800 మంది పోలీసులతో, 360 సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు. ల్యాప్ టాప్స్, బ్యానర్లు, పెన్నులు, హెల్మెట్లకు స్టేడియంలో అనుమతి లేదని మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులు, మీడియా ప్రతినిధులు సహకరించాలని కోరారు.