తెలంగాణలో కాంగ్రెస్ 80 స్థానాల్లో గెలుస్తుంది
![తెలంగాణలో కాంగ్రెస్ 80 స్థానాల్లో గెలుస్తుంది](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_641059ee93982.jpg)
మీడియాతో చిట్చాట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలకు ముందు, తరువాత కూడా పొత్తు ఉండదన్నారు. బీఆర్ఎస్తో పొత్తు ఉండదని రాహుల్ క్లియర్గా చెప్పారన్నారు. కేసీఆర్ నుంచి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ 80 స్థానాల్లో గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్కు 25 సీట్ల లోపే వస్తాయన్నారు. బీజేపీ సింగిల్ డిజిట్లో ఉంటుందన్నారు. నేను ఏ సర్వేలు చూడను. ప్రజలతో ఉన్న అనుబంధమే చూస్తా. ప్రజలతో మాట్లాడిన తరువాతే ఈ విషయం చెబుతున్నా. వార్డు మెంబర్ ఎన్నికలున్నా మోదీ, అమిత్ షా వస్తారని అన్నారు.