వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగింది?
![వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగింది?](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_644a348ccebd7.jpg)
వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో వీడియో రిలీజ్ చేసిన ఎంపీ అవినాశ్ రెడ్డి. దానిలోని అంశాలు ఇలా ఉన్నాయి.... వివేకా హత్య రోజు నాకు 6.30 గంటలకు శివప్రకాశ్ రెడ్డి కాల్ చేశారు. జమ్మలమడుగులో వైసీపీలోకి జాయినింగ్ కార్యక్రమానికి వెళుతున్నాను. పులివెందుల రింగ్ రోడ్డులో ఉండగా శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి బావ ఇంటికి వెళ్లమని చెప్పారు. వివేకా ఇంటికి ఎందుకు అని అడిగాను. ‘బావ నో మోర్’ అని శివప్రకాశ్ రెడ్డి చెప్పారు. హుటాహుటిన వివేకా ఇంటికి వెళ్ళా. వివేకా డెడ్బాడీ బాత్రూమ్లో ఉందని పీఏ కృష్ణా రెడ్డి చెప్పాడు. బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఏమైనా అనుమానాస్పదంగా ఉందా అని ఏపీను అడిగా. లేదని చెప్పాడు. మేం వెళ్లక ముందే జరిగిన అంశాలను ప్రజల ముందు పెడుతున్నాం. రూమ్లో వివేకా రాసిన లేఖ, ఫోన్ ఉన్నాయని కృష్ఱా రెడ్డి వివేకా అల్లుడు రాజశేఖర్ కు చెప్పాడు. రాజశేఖర్ ఆ లెటర్ను దాచిపెట్టాలని పీఏ కృష్ణారెడ్డికి చెప్పాడు. లెటర్, ఫోన్ దాచిపెట్టాలని చెప్పారు. డ్యూటీకి త్వరగా రమ్మని చెప్పినందుకు నా డ్రైవర్ చచ్చేలా కొట్టాడు. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దని వివేకా లెటర్లో రాశారు. ఈ లెటర్ రాయడానికి చాలాకష్టపడ్డాను అని పేర్కొన్నారు. వివేకాది హత్య అని చెప్పడానికి లెటర్ ముఖ్యమైన ఆధారం. లెటర్ఎందుకు దాచిపెట్టారని సునీత, రాజశేఖర్ని అడిగితే ప్రసాద్ చాలా మంచివాడు, అతన్ని ఎవరైనా ఏమైనా అంటారనే లెటర్ను దాచిపెట్టమని చెప్పామని వాళ్లు చెప్పారు. వివేకా చివరిసారి రాసిన లెటర్లోని అంశాలు, మాటలను మీరు నమ్మరా? సునీత ఒకసారి ఒక విధంగా తరువాత మరో విధంగా సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చింది. ఓ సారి చెప్పిన అంశాల్లోని తప్పులను కవర్ చేస్తూ మరో స్టేట్మెంట్ ఇచ్చింది. సునీతకు సీబీఐ ఎంతో స్వేచ్ఛ ఇచ్చింది. స్టేట్మెంట్లను మార్చుకునే స్వేచ్ఛ సీబీఐ వాళ్ళకు ఇచ్చింది. లెటర్ ఉన్న విషయం పోలీసులు, నాకు చెప్పకపోవడం కేసులో ప్రధానమైన తప్పు. సీబీఐ విచారణాధికారి రామ్ సింగ్ దాన్ని పక్కన పెట్టేలా చూశారు అని అవినాశ్ రెడి తను రిలీజ్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.