సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 29వ వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు

సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 29వ వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు

సి ఆర్ ఫౌండేషన్ :

భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 29వ వర్ధంతి సందర్భంగా కొండాపూర్ లోని సిఆర్ ఫౌండేషన్ లో చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి సి ఆర్ ఫౌండేషన్ ఛీఫ్‌ పాట్రన్‌, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ శ్రీ డి రాజా, సిపిఐ జాతీయ కార్యదర్శి,

సి ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ కే నారాయణ, సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కే రామకృష్ణ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సి ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, సిఆర్ ఫౌండేషన్ కోశాధికారి చెన్నకేశవరావు, ప్రజాపక్షం ఎడిటర్ కే శ్రీనివాసరెడ్డి, సి ఆర్ ఫౌండేషన్ సెక్రెటరీ మాజీ ఎమ్మెల్సీ పి జె చంద్రశేఖర్ రావు, చెన్నమనేని వెంకటేశ్వరరావు, సి ఆర్ ఫౌండేషన్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ కే రజిని, మహిళా సంక్షేమ కేంద్రం డైరక్‌టర్‌ డి. క్రిష్ణకుమారి, ఆర్‌మేనియా మాజీ భారత రాయబారి టి. సురేష్, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జంధ్యాల ప్రభాకర్, వేములపల్లి కిరణ్, పూల మాలలతో నివాళులర్పించారు...

ఈ సందర్భంగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు భౌతికంగా మన వద్ద లేకపోయినా ఆయన ఆశయాల రూపంలో మనందరిలో ఉన్నాడని అన్నారు. చండ్ర రాజేశ్వరరావు సుదీర్ఘకాలం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అనేకమందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. చండ్ర రాజేశ్వరరావు ఆశయాలను సాధించడం కోసం కృషి చేస్తామని అన్నారు. చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తితోనే ఆయన పేరు మీద సి ఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తితోనే సిఆర్ ఫౌండేషన్ను నిర్వహించి అందులో వృద్ధాశ్రమాన్ని, ఎన్‌ ఆర్‌ ఆర్‌ రిసర్‌చ్‌ సెంటర్‌, మహిళా సంక్షేమ కేంద్రం, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా సి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. చండ్ర రాజేశ్వరరావు ఆశయాలను సాధించడం కోసం కృషి చేస్తామని తెలిపారు..

ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం సలహా కమిటీ సభ్యులు శ్రీ సోమూరి తుకారాం, డాక్టర్ పి. సరస్వతి, రాజేంద్ర రావు, మేనేజర్‌ శ్రీనివాస్‌; వృద్ధాశ్రమ వాసులు, సీనియర్‌ సినీ నటులు కాకరాల, తదితరులు పాల్గొన్నారు.