ఇంటర్ సెకండియర్ ‘ఆణిముత్యం’ సాత్విక
![ఇంటర్ సెకండియర్ ‘ఆణిముత్యం’ సాత్విక](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645b84049b523.jpg)
వెయ్యికి 984, గణితంలో వందశాతం మార్కులు!
మల్కాజ్గిరి: ఇంటర్ సెంకడియర్ సైనిక్పురిలోని ‘టాపర్స్జూనియర్ కాలేజీ’కి చెందిన ఎం. సాత్విక వెయ్యి మార్కులకు గాను 984 మార్కులు సాధించి కాలేజీ సెకండ్ టాపర్గానే కాకుండా రాష్ర్టవ్యాప్తంగా అత్యధిక మార్కులు సాధించిన జాబితాలో చేరింది. అంతేగాకుండా గణితంలో 75కు గాను 75 మార్కులు సాధించి సత్తా చాటుకుంది.
ఈ సందర్భంగా సాత్విక మాట్లాడుతూ.. తండ్రి మురళీ, తల్లి భువనల ప్రోత్సాహం, కాలేజీ ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ సహకారం వల్లే తాను ఈ ర్యాంకు సాధించానంది. భవిష్యత్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలనేదే తన ఉద్దేశ్యమని సాత్విక స్పష్టం చేసింది.