ఇంటర్​ సెకండియర్​ ‘ఆణిముత్యం’ సాత్విక

ఇంటర్​ సెకండియర్​ ‘ఆణిముత్యం’ సాత్విక

వెయ్యికి 984, గణితంలో వందశాతం మార్కులు!

మల్కాజ్​గిరి: ఇంటర్​ సెంకడియర్​ సైనిక్​పురిలోని ‘టాపర్స్​జూనియర్​ కాలేజీ’కి చెందిన ఎం. సాత్విక వెయ్యి మార్కులకు గాను 984 మార్కులు సాధించి కాలేజీ సెకండ్​ టాపర్​గానే కాకుండా రాష్ర్టవ్యాప్తంగా అత్యధిక మార్కులు సాధించిన జాబితాలో చేరింది. అంతేగాకుండా గణితంలో 75కు గాను 75 మార్కులు సాధించి సత్తా చాటుకుంది.

ఈ సందర్భంగా సాత్విక మాట్లాడుతూ.. తండ్రి మురళీ, తల్లి భువనల ప్రోత్సాహం, కాలేజీ ఉపాధ్యాయులు, మేనేజ్​మెంట్​ సహకారం వల్లే తాను ఈ ర్యాంకు సాధించానంది. భవిష్యత్​లో ఇంజనీరింగ్​ విద్యను అభ్యసించి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలనేదే తన ఉద్దేశ్యమని సాత్విక స్పష్టం చేసింది.