వాళ్ల ఇళ్లను బుల్డోజర్స్తో కూల్చేస్తాం
![వాళ్ల ఇళ్లను బుల్డోజర్స్తో కూల్చేస్తాం](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63e8c2c530e7d.jpg)
హైదరాబాద్ : లిక్కర్ స్కాం ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలపై అత్యాచారాలు చేసే వారి ఇళ్లను బుల్డోజర్స్తో కూల్చుతామని తెలిపారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని పని చేస్తామన్నారు.
బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలను కన్నెతి చూడాలంటే ఆకతాయిలు వణకాలన్నారు. ఎస్టీ మహిళను రాష్ట్రపతిని చేసి మహిళలకు గౌరవం తెచ్చిన ఘనత ప్రధాని మోదీదేనని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ హాయాంలో మహిళలను చితి మీద పడుకోబెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. మహిళలకు తాళం చెవి ఇచ్చిన కుటుంబం బాగుంటుందన్నారు. తన కేబినెట్లోఎనిమిది మంది మహిళలకు మంత్రులుగా మోదీ అవకాశం కల్పించారన్నారు. ఎనిమది మంది గవర్నర్లు, నలుగురు మహిళా ముఖ్యమంత్రులను చేసిన ఘనత బీజేపీదేనన్నారు.