పవన్‌ను మేము గుర్తించం

పవన్‌ను మేము గుర్తించం
jagan vs pawan kalyan

అమరావతి: ఎన్నికల్లో 175 నియోజక వర్గాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని జగన్ ప్రకటించారని... ఒంటరిగా 175 చోట్ల ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీ (TDP)కి ఉందా అంటూ సవాల్ చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి  తెలిపారు.  బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సవాలుకు సమాధానం చెప్పలేక ఆ పార్టీ నేతలు ముఖాలు చాటేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాల అమలు చేసి ప్రజల్లోకి వెళ్లి మద్దతు ఇమ్మని అడుగుతున్నామన్నారు.

యువగళం పాదయాత్రకు జనాదరణ లేదని తెలిపారు. వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్ ఆర్థిక సాయంతో పాటు, మాందోస్ తుపాను పంట నష్ట పరిహారం చెల్లించామని అన్నారు. వైసీపీ నమ్ముకున్నది ప్రజలను మాత్రమే అని... ఇతర పార్టీలతో పొత్తులు తమకు అవసరం లేదని స్పష్టం చేశారు”అంటూ వ్యాఖ్యలు చేశారు.