రేవంత్ మాటతీరు మార్చుకోవాలి
![రేవంత్ మాటతీరు మార్చుకోవాలి](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_63ff14fd39366.jpg)
భూపాలపల్లి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన మాటతీరు మార్చుకోవాలని.. లేకుంటే సహించేది లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గండ్ర దంపతులు మాట్లాడారు. 'హత్సే హాత్ జోడో' యాత్రలో భాగంగా రేవంత్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండ్ర సత్యనారాయణ తమపై చేసిన ఆరోపణలను వారు ఖండించారు.
చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు వస్తామని.. కాంగ్రెస్ నేతలు సిద్ధమా? అని వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. గురువారం ఉదయం 11 గంటలకు భూపాలపల్లిలోని అంబేడ్కర్ సెంటర్కు తాము వస్తామని.. కాంగ్రెస్ నేతలు ఆధారాలతో రావాలని కోరారు. తాము విసిరిన సవాల్ను స్వీకరించాలన్నారు.