మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు..

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ప్రమాదవశాత్తు చిన్ననాటి మిత్రుడు మృతి చెందగా బాధిత కుటుంబానికి అతని క్లాస్ మేట్స్ అండగా నిలిచి, ఆర్ధిక చేయూతనిచ్చి ధైర్యం చెప్పారు. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రం శివారు వెంకట్రావుపల్లి (సి) కి చెందిన ముసాపురి  రమేష్ ఇటీవలె ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు హాస్పిటల్ తీసుకెళ్లగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న 2002 టెన్త్ బ్యాచ్ కు చెందిన క్లాస్ మేట్స్ చేయి చేయి కలిపారు. ఆర్ధికసాయం అందించారు. మృతుడు రమేష్ కుటుంబాన్ని గురువారం పరామర్శించి, ఓదార్చారు. రమేష్ అకాలమరణం బాధాకరమని సంతాపం ప్రకటించి, బాధిత కుటుంబానికి రూ. 36,500ల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మిత్రులు కట్కూరి నరేందర్, మేడిపల్లి శ్రీనివాస్, రమేష్. సంకెళ్ల  యుగేందర్, తూముల ప్రసాద్, మాడిశెట్టి తిరుపతి, పులి శ్రీను, సంకెళ్ల రాజేందర్ లు పాల్గొన్నారు.