బంగారు తెలంగాణ కాదు బహుజన తెలంగాణ కావాలి

బంగారు తెలంగాణ కాదు బహుజన తెలంగాణ కావాలి
  • మూడుసార్లు గెలిచిన అభివృద్ధి అనకొండత లేదు - కేకే మహేందర్ రెడ్డి

ముద్ర,తంగళ్లపల్లి:- రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.అనంతరం తాను మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం అసమర్థత కొనసాగిస్తూ, టీఎస్పీఎస్సీ విఫలమయిందని అన్నారు. ఆలీబాబా 40 దొంగలు లాగా బిఆర్ఎస్ మంత్రులు చిక్కరు దొరకరని వచ్చిన పోలీసుల బలగాలతో వస్తారని హెద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలతో ముందుకు రావడంతో 1100 ఉన్న సిలిండర్ 400 కి ఇస్తామని ప్రజలని మభ్యపెడుతున్నారని నలుగురు బాగుపడాలంటే బిఆర్ఎస్ కి, అందరూ బాగుపడాలంటే కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్,వెంకట్రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజ్ , వైద్య శివప్రసాద్ , జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూతురి వెంకట్ రెడ్డి,నేరళ్ళ నర్సింగం గౌడ్,లింగాల భూపతి ,మునిగెల రాజు,పొన్నాల పరుశరాములు ,గుగ్గిళ్ళ భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.