లీకేజీ,ప్యాకేజీ ల బిఆరేస్ ప్రభుత్వాన్ని గద్దె దెంచే దాకా పోరాటం ఆగదు- నంద్యాడపు వెంకటేష్

లీకేజీ,ప్యాకేజీ ల బిఆరేస్ ప్రభుత్వాన్ని గద్దె దెంచే దాకా పోరాటం ఆగదు- నంద్యాడపు వెంకటేష్

ముద్ర, రుద్రoగి: భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల శాఖ అధ్యక్షులు రాసురి నర్సారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంలో
జెండా ఎగురవేసి,దేశంలోని బిజెపి పార్టీ కార్యకర్తలకు ,నాయకులకు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు.దీనికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ లీకేజీ,ప్యాకేజీ ల రాష్ట్ర బిఆరేస్ ప్రభుత్వం గద్దె దించెదాక పోరాటం ఆగదు అని,బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ,ఎంపీ బండి సంజయ్ పై అక్రమ కేసులు పెట్టి జైల్ కి పంపడాన్ని  తీవ్రంగా తప్పుపడుతున్నాం,ఎన్ని కేసులు పెట్టిన కేసిఆర్ ను గద్దె దించేవరకి ఎంత పోరాటం ఆగదు అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది అని అన్నారు, తప్పు చేస్తే కొడుకు అయిన,బిడ్డ అయిన జైల్ కి పంపుతాం అని చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్ టి ఎస్ పి ఎస్సి పేపర్ లీకేజీ విషయంలో కొడుకు మంత్రి కేటీఆర్ ను,లిక్కర్ స్కామ్ లో కూతురు ఎమ్మెల్సీ కవిత ఎందుకు అరెస్ట్ చేయడం లేదో సమాధానం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం బీసీ లను అణచివేసే కుట్ర పన్నినవు నిన్ను రానున్న రోజుల్లో బీసీలు అందరూ కలిసి నిన్ను ప్రగతి భవన్ నుండి ఫార్మ్ హౌజ్ కి పంపియ్యడానికి సిద్దం అయ్యారని అన్నారు.ఈ కార్యక్రమంలో బోయిని రాజు,గడ్డం రవి, తోపారపు లత,గడ్డం గణేష్,మీసాల రవీందర్,చక్రధర్,అరిపెల్లీ నర్సయ్య,అవునురీ నరేష్,కంటే నరేష్,మొగుళ్ళ శ్రీహరి,మరిపెల్లీ గంగనర్శయ్య పాల్గొన్నారు.