నేడు మంత్రి కేటీఆర్, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేతుల మీదుగా నూతన ఆలయానికి భూమి పూజ

నేడు మంత్రి కేటీఆర్, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేతుల మీదుగా నూతన ఆలయానికి భూమి పూజ
  • శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణానికి కోటి 80 లక్షలు మంజూరు

 ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నేడు ఉదయం పదిన్నర గంటలకు అశ్విని నక్షత్ర యుక్త సింహ లగ్నమున  శ్రీ వేణుగోపాలస్వామి నూతన ఆలయ పునర్నిర్మాణానికి  భూమి పూజ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేతుల మీదుగా జరుగుతుందని మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లను  సర్పంచ్ వెంకట్ రెడ్డి, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, ఉపాధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు బొమ్మ కంటి రవి, మేగి నరసయ్య, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.

అదేవిధంగా భక్తులు ప్రతి ఇంటి నుంచి నవధాన్యములు,పుష్పలాతో తరలివచ్చి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు వినోద్ రావు, నాప్స్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మండల ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, మండల సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి పరుశరామ్ గౌడ్, ఎనగందుల అనసూయ నర్సింలు, ఉప సర్పంచ్ రజిత బాలరాజు యాదవ్, వార్డు సభ్యులు  గ్రామస్తులు పాల్గొంటారు.