24/7 అందుబాటులో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్: ఎస్పి అఖిల్ మహాజన్ 

24/7 అందుబాటులో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్: ఎస్పి అఖిల్ మహాజన్ 

ముద్ర సిరిసిల్ల టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల పట్టణంలో ఎస్పి కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పి మాట్లాడుతూ భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. 24/7 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ అందుబాటులో వుంటుందని అన్నారు. విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతారన్నారు.