రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితం లేని వృద్ధురాలు మృతి

రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితం లేని వృద్ధురాలు మృతి

ముద్ర,ఎల్లారెడ్డిపేట: జరిగిన రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితం లేని వృద్దురాలు మృతి చెందిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులోని పెట్రోల్ పంపు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో తంగళ్ళపల్లి మండలం బద్దనపల్లికి చెందిన మతిస్థిమితం లేని చెంచులక్ష్మి 62 అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్సై రమాకాంతు తెలిపిన వివరాల ప్రకారం వృద్దురాలు లక్ష్మి శనివారం ఉదయం నుంచి గ్రామంలో తిరుగుతుందని మధ్యాహ్నం గ్రామస్తులే భోజనం పెట్టారని రాత్రివేళ సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై సంచరిస్తుండగా వెనుక వైపు నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ అల్లాడి వరూస్ సిరిసిల్ల పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.