మీరేమన్నా రేవంత్ వారసులా...

మీరేమన్నా రేవంత్ వారసులా...
  •  బీఆర్ఎస్ తిరుపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నాయకులు...
  • బీఆర్ఎస్ పిండ ప్రధానo చేసిన చోట, కాంగ్రెస్ శుద్ధి...

ముద్ర, మల్యాల: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నేతలు పిండ ప్రధానo చేయడంపై మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మల్యాల క్రాస్ రోడ్డు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు పిండ ప్రధానo చేసిన స్థలాన్ని కాంగ్రెస్ నాయకులు శుద్ధి చేసి, అనంతరం అక్కడే రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ బూటకపు మాటలను రైతులు నమ్మవద్దని నినాదాలు చేశారు.

మాజీ జడ్పీటీసీ దారం ఆదిరెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టాలు చూసి ఉచిత 24 గంటల విద్యుత్ ప్రవేశపెట్టింది దివంగత వైయస్సార్ అని, ఉచిత విద్యుత్ పేర బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దోపిడిని బయట పెడ్తున్న రేవంత్ రెడ్డిని నిందితుడిగా చూపెట్టేందుకు చేస్తున్న బూటకపు కార్యక్రమాలను రైతులు నమ్మరని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు దొంగ ఆనందరెడ్డి, నాయకులు వెల్మ లక్ష్మారెడ్డి, మారంపల్లి గంగాధర్, కంచెర్ల లక్ష్మణాచారీ, ఎండీ ఇమామ్, బక్కశెట్టి శ్రీనివాస్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.