ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి...

ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి...
  • జిల్లా అదనపు కలెక్టర్లు బి. సత్య ప్రసాద్,ఎన్. ఖిమ్యా  నాయక్

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల :ప్రజావాణి లో  ప్రజల నుండి స్వీకరించిన  ఫిర్యాదులకు సంబంధిత అధికారులు స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్,జిల్లా అదనపు  కలెక్టర్ ఎన్. ఖిమ్యా  నాయక్ లు అధికారులకు ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో  ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని అన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలించి, అట్టి దరఖాస్తులకు సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గం చూపాలని ఆదేశించారు..కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 34  ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డివో ఆనంద్ కుమార్ ,  వేములవాడ ఆర్డివో పి. మధుసూదన్, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగయ్య,  ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.