నేతన్న గడ్డపై జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

నేతన్న గడ్డపై జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

ముద్ర సిరిసిల్ల టౌన్:-రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ పద్మశాలి కుల బంధువులతో కలిసి పాత బస్టాండ్ లో నేతన్న విగ్రహానికి, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించనున్న జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి పద్మశాలి సంఘం, చేనేత సంఘాల నాయకులు, కార్మికులు తో కలిసి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు వెల్డండి దేవదాస్, బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, పాలిస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మండల  సత్యం, పద్మశాలి సంఘం, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.