బిఆర్ఎస్ లో చేరిన యువకులు

బిఆర్ఎస్ లో చేరిన యువకులు

ముద్ర,రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పలువురు యువకులు శనివారం రోజున వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చల్మడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.. వారికి చల్మడ లక్ష్మీనరసింహారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..ఈ సందర్భంగా చల్మడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని పార్టీ కోసం ఒకరినొకరు కలుపుకొని పనిచేయాలని అన్నారు.
కెసిఆర్ పాలనలో రాష్ట్రం, వేములవాడ  అభివృద్ధి చెందుతున్నదని అన్నారు..రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం అన్నారు.. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గట్ల మీణయ్య,సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం,గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్,మాడిశెట్టి ఆనందం,చెప్యాల గణేష్,మంచే రాజేశం,పాల నర్సయ్య,కదాసు లక్ష్మణ్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు..