సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం  నారాయణపూర్ గ్రామ పంచాయతి ఆవరణలో శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. లబ్ధిదారులు కుదరిపి రాములు కు రూ.19 వేలు,బుదయ్య రూ. 24 వేలు, జై రాజవ్వ రూ.20 వేలు, పి లావణ్య రూ.20 వేలు చెక్కులను  సర్పంచ్ నిమ్మ లక్ష్మి నారాయణరెడ్డి అందించారు. సర్పంచ్ నిమ్మ లక్ష్మీ మాట్లాడుతూ  పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సహాయం ఖర్చులకు సిఎంఆర్ ఎఫ్ రిలీఫ్ పండు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆపెరా సుల్తానా మాజీద్, గ్రామ మహిళా అధ్యక్షురాలు అంబటి పద్మ,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, పూదరి నర్సయ్య, శంకరయ్య, కిషన్ రెడ్డి,భూమయ్య తదితరులు పాల్గొన్నారు.