సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి- ఎస్పీ అఖిల్​ మహాజన్​

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి- ఎస్పీ అఖిల్​ మహాజన్​

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. NCRP portal (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు తక్షణమే కాల్ చేయండి ఆధునిక సాంకేతిక హంగులున్న స్మార్ట్ ఫోన్  ప్రతిఒక్కరికి చేతుల్లో ఉంటున్నాయన్నారు. ప్రస్తుత కాలంలో సామాన్యులకు సైతం స్మార్ట్ఫోన్లు కనీస అవసరాలయ్యాయని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాలతో ఫోన్ నంబర్లు అనుసంధానం కావడంతో యాప్ లు డౌన్లోడ్ చేసుకుని చాలామంది నగదు రహిత లావాదేవీలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఓ వైపు డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తుండగా అంతే వేగంగా మరోవైపు సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మొబైల్లో ఆటలు ఆడే సందర్భంలో, వివిధ రకాల సైట్లలో మనకు అవసరమైన వస్తువులు అతితక్కువ ధరకు లభిస్తాయని వచ్చే ప్రకటనలకు ఆకర్షితులైన వారు వెంటనే ఆ లింకు లపై క్లిక్ చేస్తున్నారని తెలిపారు. దీంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నరన్నారు. తక్షణమే ఆ మొబైల్ నంబరుకు అనుసంధానంగా ఉన్న బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు నేర గాళ్ల పరమవుతోందని తెలిపారు. విషయం తెలుసుకునే సరికి సొమ్ము ఖాళీ కావడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రస్తుత రోజుల్లో అనేక సైబర్ మోసాలు బాగా పెరిగాయి. వీటి నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాల బారిన పడిన వెంటనే ఆలస్యం చేయకుండా సొమ్ములు తిరిగి పొందేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1930 ను ఆశ్రయించాలన్నారు.

రాజన్నసిరిసిల్ల జిల్లా పరిధిలో నమోదైన కేసుల వివరాలు

 సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడు పేస్ బుక్ ఒక యాడ్ చూసి అందులోని ఒక మొబైల్ నెంబర్ కి మెసేజ్ చేయగా అతనికి ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేసి అందులో ఆర్డర్ చేస్తే డైలీ ఇన్కమ్ గా కొంత డబ్బు వస్తుందని చెప్పాడు. బాధితుడు ఈ విషయాన్ని నమ్మి విడతల వారీగా కొంత డబ్బుతో ఆర్డర్స్ చేశాడు. కానీ ఎటువంటి అమౌంట్ అతనికి తిరిగి రాలేదు. చివరగా బాధితుడు మోసపోయానని తెలుసుకున్నారు.

వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడికి FLIPKART వెరిఫికేషన్ సంబంధించిన వారిగా చెప్పుకొని బాధితుడు దగ్గర నుండి ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఆక్టివేట్ చేస్తామని చెప్పి మూడుసార్లు ఓటిపి తీసుకోవడం జరిగింది. దీంతో బాధితుడు 21000 నష్టపోయాడు.

సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడు GOOGLE నందు వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ సర్వీస్ కేర్ నెంబర్ గురించి వెతికాడు అతనికి ఒక నెంబర్ దొరికింది. ఆ నెంబర్ కి కాల్ చేయరా కనెక్ట్ అయి డిస్కనెక్ట్ అయింది. కొద్దిసేపటికి అతనికి ఒక నంబర్ నుండి కాల్ వచ్చింది. ఇప్పుడు బాధితుడు వాళ్లతో మాట్లాడుతూ క్విక్ సపోర్ట్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ తీసుకోమనగా ఇన్స్టాల్ తీసుకున్నాడు. క్రెడిట్ కార్డు డీటెయిల్స్ వారికి ఇచ్చాడు. తర్వాత బాధితుడి క్రెడిట్ కార్డు నుండి 30 వేల రూపాయలు నష్టపోయారు..

ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడికి తన యొక్క పాన్ కార్డు లింక్ కాలేదు బ్లాక్ అవుతుందని మెసేజ్ రావడంతో పాన్ కార్డు యొక్క అప్డేట్ గురించి మెసేజ్ లో వచ్చిన లింక్ క్లిక్ చేశాడు అందులో  బాధితుడి యొక్క వ్యక్తిగత వివరాలు నమోదు చేశాడు దాంతో పాటు ఓటిపి కూడా ఎంటర్ చేశాడు తద్వారా బాధితుడు 5000 నష్టపోయాడు..

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్క బాధితుడు టీ లోన్ అనే అప్లికేషన్లో లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు లోన్ సంబంధిత వారు తీసుకున్న దానికంటే ఎక్కువగా తిరిగి కట్టమని హరాస్మెంట్ చేస్తున్నారు.
వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడు అతని యొక్క ఆన్లైన్ బ్యాంకింగ్ లో లాగిన్ అయ్యేటప్పుడు ఒక మెసేజ్ రావడంతో అందులో ఒక ఓటిపి ద్వారా బదితులు 1800 రూపాయలు నష్టపోయాడు..

తీసుకోవలసిన జాగ్రత్తలు:-

  • మీకు లాటరి వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.. ఆశపడకండి, అనుమానించండి.
  • లాటరి పేరుతో సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండండి. మీకు ఇలాంటి మెసేజెస్ వస్తే వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.
  • అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి,మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.
  • వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.
  • తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.
  • మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.
  • "ఇంస్టాగ్రామ్" లో మీకు తెలిసిన వ్యక్తి ఫోటో వుండి మిమ్మల్ని డబ్బులు పంపమని అడుగుతున్నాడా? మరి ఆ మెసేజి మీకు తెలిసిన వ్యక్తే పంపాడా? తెలుసుకోండి, మోసపోకండని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.