బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం

బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం

సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి

 ముద్ర,ఎల్లారెడ్డిపేట :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన దోమ్మాటి నర్సయ్య భార్య, కూతురు ప్రహరి గోడ కూలి మృతిచెందగా వారి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించి, ఓదార్చి 5000 వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దురదృష్టవశాత్తు గోడకూలి చనిపోయిన తల్లి కూతుళ్ళ వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎనగందుల అనసూయ నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, వార్డు సభ్యులు ఎనగందుల అంజలి బాబు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హసన్ బాయ్, అంబేద్కర్ సంఘ నాయకులు హాన్మయ్య,గోపాల్, రాములు, మల్లేశం, సాయిలు, మోషి, ఏనగందుల గణేష్, బంధారపు బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.