కామారెడ్డి లో మిస్సింగ్.. కొత్త పల్లి లో శవమై..
ముద్ర, గంభీరావుపేట : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మిస్సయిన మహిళ, జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని చెరువులో శవమై తేలింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన బేరిగి నర్సవ్వ (40)వ్యక్తిగత పనుల నిమిత్తం కామారెడ్డి కి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోయేసరికి బంధువులు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 15 తెది నా ఫిర్యాదు చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్త పల్లి గ్రామ శివారులోని చెరువులో ఓ మహిళ మృతి దేహం లభ్యం కాగా, స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, వారు కామారెడ్డి పోలీసులకు సమాచారం అందించడంతో, సంఘటన స్థలానికి చేరుకున్న కామారెడ్డి పోలీసులు బైరి నర్సవ్వ మృతదేహముగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నర్సవ్వను ఎక్కడో హత్య చేసి, కొత్తపళ్లి గ్రామ చెరువులో పడి వేశారని, అనుమానితులను అరెస్టు చేశామని కామారెడ్డి టౌన్ సి ఐ నరేష్ తెలిపారు.
బంధువుల ఆందోళన...
మంగళవారం ఉదయమే మృతదేహం లభ్యం కాగా, సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకు తీయకపోవడంతో ఆగ్రహించిన నర్సవ్వ బంధువులు లింగన్నపేట గ్రామంలోని కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ధర్నా స్థలానికి చేరుకున్న ఎస్సై మహేష్ బంధువులతో మాట్లాడి ఆందోళనను విరమింప చేశారు.