బాకూరు పల్లి లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

బాకూరు పల్లి లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ముద్ర,ఎల్లారెడ్డిపేట: సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు 50 వేల విలువైన చెక్కులను గురువారం గ్రామ సర్పంచ్ అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లె తండ గ్రామంలో లబ్ధిదారులు  ఆజ్మీర చందుకు 15వేలు, గుగులోత్ అఖిల కు 35 వేల విలువ గల చెక్కులను  గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ అజ్మీరా మంజుల రాజు నాయక్ సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు  అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నందరాజు, ఉప సర్పంచ్ జస్వంత్, వార్డు సభ్యులు తిరుపతి, భాస్కర్, రాంసింగ్, నాయకులు పుణ్యా, హరిసింగ్, రాములు, లింగం,సురేష్, సరియా, హరి, మురళి తదితరులు పాల్గొన్నారు.