ముగ్గురు పిల్లలతో సహా మిడ్ మానేరులోకి దూకి తల్లి ఆత్మహత్య..
ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: ఇద్దరు పిల్లలతో సహా తల్లి మిడ్ మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కోదురుపాక లో శుక్రవారం చోటుచేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం కి చెందిన రజిత కరీంనగర్ లోని సుభాష్ నగర్ కి చెందిన మహ్మద్ అలీ నీ లవ్ మ్యారేజి చేసుకున్నది. వీరికి ఉస్మాన్ అహ్మద్ (14), అయ్యన్ (7), అశ్రజాబిన్ (5 నెలలు) పిల్లలు ఉన్నారు. శుక్రవారం తల్లిగారు ఇంటికి వెళ్తున్న అని చెప్పి పిల్లలతో సహా బయటకు వచ్చిన రజిత బోయిన్ పల్లి మండలం కోదురుపాక మిడ్ మానేరు బ్రిడ్జి పై నుండి మిడ్ మానేరులోకి ముగ్గురు పిల్లలతో సహా దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి, కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.