గౌడ సంఘం నూతన అధ్యక్షునికి సన్మానం - ఏఎంసీ చైర్మన్ ఎలుసాని మోహన్ ఆధ్వర్యంలో

గౌడ సంఘం నూతన అధ్యక్షునికి సన్మానం - ఏఎంసీ చైర్మన్ ఎలుసాని మోహన్ ఆధ్వర్యంలో

ముద్ర,ఎల్లారెడ్డిపేట : నూతనంగా ఎన్నికైన గౌడ సంఘం అధ్యక్షున్ని బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుసాని మోహన్ కుమార్ బుధవారం శాలువతో సన్మానించారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో నిన్నటి రోజు గౌడ సంఘం నూతన అధ్యక్షునిగా లింగాల నరసయ్య, ఉపాధ్యక్షులుగా  రాధాకృష్ణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీని ఎలుసాని మోహన్ కుమార్ ఆధ్వర్యంలో శాలువతో సత్కరించి సన్మానం చేశారు. ఎన్నికైన కమిటీకి అభినందనలు తెలిపారు.