గంభరావుపేటలో బీజేపీ నాయకుల అరెస్ట్..
![గంభరావుపేటలో బీజేపీ నాయకుల అరెస్ట్..](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_6513ef3beb895.jpg)
ముద్ర, గంభీరావుపేట: మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులను పోలీసులు ఉదయం నుండి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణలో బీజేపీ లేదన్న మంత్రి కేటీఆర్, ఎందుకు బీజేపీ,బీజెవైఎం నాయకులను అరెస్టు చేస్తున్నారని బిజెపి మండల అధ్యక్షుడు గంట అశోక్ ప్రశ్నించారు. గంభీ రావుపేటలో నిర్మించే మార్కెట్ యార్డ్, బస్తీ హాస్పిటల్ మరియు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయని అన్నారు. సొమ్మొకరిది, సోకు ఒకరిది విధముగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, రానున్న ఎన్నికల్లో బీ ఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని గంట అశోక్ అన్నారు.