అధికారుల తీరుపై మండిపడుతున్న రాజన్న భక్తులు

అధికారుల తీరుపై మండిపడుతున్న రాజన్న భక్తులు

ముద్ర, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సందర్భంగా  ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు తలనీలాలు సమర్పించుకొని భక్తులు సేవలో తరించారుతెల్లవారు జామునుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్‌లో బారులుదీరారు. అంతవరకు బాగానే ఉన్నారు గంటల కొద్ది భక్తులు ఉన్నప్పటికీ అధికారులు వారిని పట్టించుకోకుండా విఐపి సంబంధించిన భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి ప్రత్యేక లైన్లో దేవదర్శనానికి పంపిస్తున్నారని, నిరుపేద భక్తులకు మాత్రం పట్టించుకోవడంలేదని వారు తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికార తీరు మారాలని భక్తులు కోరుతున్నారు.