‘బలగం’ నటుడు కీసరి నర్సింగం మృతి డైరెక్టర్ వేణు యెల్దండి సంతాపం
![‘బలగం’ నటుడు కీసరి నర్సింగం మృతి డైరెక్టర్ వేణు యెల్దండి సంతాపం](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64f7fbb3eb53e.jpg)
ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: కమెడియన్ వేణు యెల్దండి మొట్టమొదటి సారి దర్శకత్వం వహించిన ‘ బలగం’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పంచాయతీ పెద్దగా నటించిన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారాం గ్రామానికి చెందిన కీసరి నర్సింగం(65) క్యాన్సర్ బారిన పడి మంగళవారం మృతి చెందారు. బుధవారం స్వగ్రామమైన నాగారంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కీసరి నర్సింగం మరణవార్త తెలుసుకున్న బలగం డైరక్టర్ వేణు ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. వేణు అందుబాటులో లేకపోవడంతో బలగం టీమ్ నుంచి రచ్చ రవితో పాటు కాయితి బాలు నాగారం వెళ్లి కీసరి నర్సింగం బౌతికకాయానికి నివాళులు అర్పించారు. నర్సింగం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కీసరి నర్సింగం స్టేజీ నాటకాలు వేసి, స్వగ్రామంలో రంగస్థల నటుడిగా పేరుతెచ్చకొని బలగం సినిమాతో సినీపరిశ్రమకు పరిచయం అయ్యారు. నర్సింగం మృతి పట్ల రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, కోనరావుపేట మండల ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు.