బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత - సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత - సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి

ముద్ర,ఎల్లారెడ్డిపేట : బాధిత కుటుంబానికి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి 5 వేల ఆర్థిక సహాయాన్ని సోమవారం అందించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన షరీఫా కుమారుడు అతిక్ అనే యువకుడు గత వారం కామారెడ్డి  రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన  విషయం తెలిసిందే  కటిక నిరుపేద కుటుంబంలో జీవిస్తున్న అతిక్  మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర  దుఃఖ సముద్రంలో మునిగిపోగా  సమాచారం తెలుసుకున్న సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి  వారి ఇంటికి వెళ్లి పరామర్శించి  భరోసాను కల్పిస్తూ 5వేల ఆర్థిక సహాయాన్ని అందించాడు. కృష్ణారెడ్డి తో పాటు బి ఆర్ ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, హసన్ బాయ్, ఎలగందుల నర్సింలు, బందారపు బాల్ రెడ్డి, గంట దేవా గౌడ్, నాగరాజు,ఇస్మాయిల్,  సద్దాం తదితరులు పాల్గొన్నారు.