అనారోగ్యంతో వృద్ధుడు బలవన్మరణం

అనారోగ్యంతో వృద్ధుడు బలవన్మరణం

ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం  హారిదాస్ నగర్ గ్రామానికి చెందిన గోపన్నగారి లక్ష్మయ్య  బుధవారం రాత్రి పధిర బ్రిడ్జి కింద ఉన్న చెట్టు కు లుంగీ తో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.అనారోగ్యంతో బాధపడుతున్న గోపన్న గారి లస్మయ్య (75 )  జీవితంపై విరక్తి చెంది  బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో  ఉరి వేసుకుని   బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది.ఈ విషయం తెలుసుకున్న అతని భార్య బలవ్వ,  కుమారులు మల్లేశం, నాగరాజు లు బంధు మిత్రులు  సంఘటన స్థలానికి వెళ్లి మృత దేహాన్ని చూసి బోరున విలపించారు. దీంతో హారిదాస్ నగర్ లో  విషాదం అలుముకుంది.పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని   సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.