అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి ..
- తలపై బలమైన గాయాలు..
- మెడలోని నగలు అపహరణ..
- దొంగలే హత్య చేశారా..?
మెట్పల్లి ముద్ర:- తల పగిలి అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం మండలం గోదురు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గోధుర్ గ్రామానికి చెందిన మెట్టు నర్సు (55) మధ్యాహ్నం ఇంటిలో భోజనం చేసి గ్రామ శివారులో ఉన్నటువంటి సబ్ స్టేషన్ వద్ద గల తన తోటలోకి మొక్కజొన్న కలుపు తీసేందుకు వెళ్ళింది రాత్రి ఎంత సమయం అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తోట వద్దకు వెళ్లి చూడగా తోట వద్ద సబ్ స్టేషన్ దగ్గర తల పగిలి అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండగా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో డిఎస్పి రవీందర్ రెడ్డి, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై ఉమా సాగర్ లు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. మృతురాలి మెడలో నగలు లేకపోవడంతో దొంగలు నగల కోసం మృతురాలిని కొట్టి హత్య చేసి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.