వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రధాని మోడీ
ముద్ర,తెలంగాణ:- ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ఉదయం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో రాజన్నకు ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిసారిగా వేములవాడకు వచ్చిన ప్రధాని మోదీకి ఆలయ సిబ్బంది, అర్చకులు, పాలకవర్గం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఈ ఉదయం ప్రధాని మోదీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయంలో కొడెల మొక్కలను మోదీ చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ప్రధానిని మోదీని ఆలయ మర్యాదాలతో సన్మానం చేశారు.అనంతరం అక్కడి నుంచి వేములవాడలో నిర్వహించే బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్లారు.