నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి ఇద్దరు కూలీలు మృతి
![నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి ఇద్దరు కూలీలు మృతి](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64f97fbf1be58.jpg)
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ కేపీహెచ్బీలోని అడ్డగుట్టకాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో పనులు జరుగుతోన్న సమయంలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. అడ్డగుట్టలో మెయిన్ రోడ్డు పక్కనే భవన నిర్మాణం జరుగుతుంది. గురువారం ఉదయం కార్మికులు పనులు చేస్తున్న సమయంలో పిట్టగోడ, సెంట్రింగ్ కర్రలు విరిగిపడ్డాయి. దీంతో పనులుల్లో ఉన్న నలుగురు కూలీలు ప్రమాదవశాత్తు ఆరో అంతస్తు నుంచి కిందపడ్డారు. ఇద్దరు కూలీలు ఘటన స్థలంలోనే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు స్థానిక ఆస్పత్రికి తరలించారు.