ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి కి ఘన సన్మానం

ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి కి ఘన సన్మానం

మోత్కూర్ (ముద్ర న్యూస్ ):మోత్కూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ గుర్రం లక్ష్మీనరసింహారెడ్డి , డైరెక్టర్లు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, ఎస్ఎన్ చారి, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, ఎండి ఖలీల్, గుండు ప్రసాద్ పిఆర్ఓ లను సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీనరసింహారెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ సేవా కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యుల సహకారం ఎంతో ఉంది. ఇకముందు మీ సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరుతు మా వలన మీ సంఘ సభ్యులకు ఎల్లవేళలా సహకారం ఉంటుందని అన్నారు.

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మొగుళ్లపల్లి సోమయ్య మాట్లాడుతూ గతంలో డాక్టర్ లక్ష్మీ నరసింహ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలను కొనియాడారు .ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు సోమ వెంకటేశ్వర్లు, బుస్సా శ్రీనివాస్, మండల అధ్యక్షులు ఇరుకుల్ల వెంకన్న , గౌరు శ్రీనివాస్, కోశాధికారి బుక్క విశ్వనాథం, పి ఆర్ ఓ  బండారు ప్రసాద్, వీరవల్లి ప్రవీణ్ కుమార్ గౌరు సత్యనారాయణ, సోమ లింగయ్య ,తిప్పిరి శెట్టి  రాజ వీరయ్య ,శ్రీను ,అనంతుల అశోక్, సోమ నరేందర్, బుక్క శ్రీనివాస్, గందే రంగయ్య, గందె ఉమేష్ ,మురారి శెట్టి వెంకటయ్య మురారి శెట్టిశ్రీను, మురారి శెట్టిశ్రీధర్, సోమ మనీ ,పందిరి వెంకన్న ,గందె ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.