నాపేరును దుర్వినియోగపరుస్తున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసిన సుధామూర్తి

నాపేరును దుర్వినియోగపరుస్తున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసిన సుధామూర్తి

ముద్ర, తెలంగాణ బ్యూరో : తన పేరును దుర్వినియోగపురస్తున్నారంటూ ఇన్పోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పోలీసులను ఆశ్రయించారు. తనకు సంబంధం లేని కార్యక్రమాల్లో తన పేరును వాడుకుంటూ కొందరు డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు సుధామూర్తి తరపున ఆమె ఎగ్గిక్యూటివ్ బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమెరికాలో సెప్టెంబరు 26న జరగనున్న మీట్ అండ్‌ గ్రీట్ కార్యక్రమానికి సుధామూర్తి హాజరవుతారంటూ శ్రుతి అనే మహిళ ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు డబ్బులను వసూలు చేసింది. ఈ వ్యవహారం సుధామూర్తి కార్యాలయం దృష్టికి వచ్చింది.  మరోఘటనలో కన్నడకూట నార్తన్‌ కాలిఫోర్నియా 50వ వార్షికోత్సవం సందర్భంగా సుధామూర్తికి ఇటీవలే ఆహ్వానం అందింది. అయితే బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆమె ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. అయినప్పటికీ కొందరు సుధామూర్తి ఆ కార్యక్రమానికి హాజరువుతున్నారంటూ  ప్రచారం చేశారు. ఈ మేరకు డబ్బు వసూలు చేశారు. ఈ విషయం ఆగస్టు 30వ తేదీన సుధామూర్తి దృష్టికి చేరింది. లావణ్య అనే మహిళ తాను సుధామూర్తి వ్యక్తిగత కార్యదర్శిని అని చెప్పి పలువురిని మోసం చేసినట్లు తేలింది. దీంతో సుధామూర్తి లావణ్య, శ్రుతిపై  పోలీసులకు ఫిర్యాదు చేశారు.