స్వామివారి దర్శించుకున్న మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు

స్వామివారి దర్శించుకున్న మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు

ప్రభుత్వ ప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తో కలిసి ప్రత్యేక పూజలు 
 యాదగిరిగుట్ట, ఏప్రిల్ 2 (ముద్ర న్యూస్)యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మహారాష్ట్ర కు చెందిన బి ఆర్ ఎస్ నాయకులు సుదీర్ బిందు, కైలాస్ తవార్, శరత్ మర్కాడ్, సువర్ణ కాటే,  రాజీవన్ బోండార్, నారాయణ విభూదే, బిజీ కాక, అనిల్ రంజకర్, పవన్ కార్వార్ భగవత్ పాటిల్, అతుల్ కులకర్ణి గోవింద్ తో పాటు 70 మంది బిఆర్ఎస్ నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ తో కలిసి స్వయంబు నారసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వారికి అర్చకులు ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారి స్వామివారి ప్రసాదాలను అందజేశారు అనంతరం మహారాష్ట్ర చెందిన బి ఆర్ ఎస్ నాయకులు యాదాద్రి శ్రీ లక్ష్మి స్వామి వారి ఆలయ నిర్మాణాలను పరిశీలించారు పూర్తి కృష్ణ శిలతో నిర్మితమైన యాదగిరిగుట్ట  ఆలయం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. ఇంతటి గొప్పది ఆలయాన్ని పునర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు వాళ్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు విట్టల్ యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.