రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన వి ఆర్ కళాశాల విద్యార్థిని......

రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన వి ఆర్ కళాశాల విద్యార్థిని......

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని విఆర్ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న చిట్టిమల్ల సంధ్య ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫుట్బాల్ బాలికల అండర్ 19 విభాగంలో తన ప్రతిభను చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ నాలం అయ్యప్ప చెప్పారు. శుక్రవారం నాడు కళాశాలలో ఆయన ముద్ర న్యూస్ తో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికను నల్లగొండ పట్టణ కేంద్రంలో నిర్వహించిన సందర్భంగా సంధ్య తన అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అక్టోబర్ 14 నుండి 16వ తేదీ వరకు సదాశివపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందని తెలిపారు. సంధ్య గతంలో రెండుసార్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినట్లు గుర్తు చేశారు. సంధ్యా రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక కావడాన్ని కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఉప్పలి రాజు. అధ్యాపకులు ఎరుకల పరుశరాములు. సునంద. మానస. మధుసూదన్. భాస్కర్. కమలాకర్. వీరాచారి. ఉప్పాచారి. కృష్ణ. రమేష్. జ్యోతి. ఇందిరా. సింధు తో పాటు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.