గుండెపోటుతో దుబాయ్ లో యువకుని మృతి
![గుండెపోటుతో దుబాయ్ లో యువకుని మృతి](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64fd83a487955.jpg)
ముద్ర,తంగళ్లపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందన లింగం పర్శరాములు వయస్సు 38 గత 4 సంవత్సరాలు గా దుబాయ్లో అల్జమాల్ కంపెనీ లేబర్ వీసా పని కోసం వెళ్ళాడు.జూలై మాసంలో 9వ తేదీన దుబాయ్ కి వెళ్ళాడు. శనివారం రోజున రోజువారీ పనిరీత్యా డ్యూటీకి వెళ్లగా పని ప్రదేశంలో ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు.కూతురు 3 సంవత్సరాల జశ్విత తేజ భార్య అనూష గర్భవతి, తల్లిదండ్రులు వృద్ధాప్యంతో నిరుపేద కుటుంబం కావున మృతుని బాడిని స్వగ్రామానికి తీసుకువచ్చెల ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ ని వేడుకుంటున్నారు.