విజేతగా రండి

విజేతగా రండి
  • రాష్ట్ర స్థాయి వాలీబాల్  పోటీల్లో దుమాల యువకులు
  • ట్రాక్ సూట్ కోసం 10వేల అందజేత
  • జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు

ముద్ర, ఎల్లారెడ్డిపేట : వాలీ బాల్ పోటీలో  ఆడి విజేతగా నిలిచి  రాజన్న సిరిసిల్ల జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆకాంక్షిస్తూ 10 వేల నగదును జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణ్ రావు అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన యువకులు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనడానికి వెళ్తున్న సందర్భంగా ఆదివారం స్థానిక జెడ్పిటిసి కార్యాలయంలో 10 వేల నగదును  క్రీడా దుస్తుల కొరకు జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు అందజేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు పేరు ప్రఖ్యాతలు  వస్తాయని లక్ష్యంతో ఆడి గెలవండని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు గుల్లపల్లి నరసింహారెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, దోమల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.