ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యాయి

ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యాయి

ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు ఉదయం 9 గంటలకు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు పోలీసులు అన్నిచోట్ల భారీ బందోబస్తు నిర్వహించారు.  విద్యార్థిని విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనంతరం తరగతి గదులకు అనుమతినిచ్చారు. అసౌకర్యాలకు తావు లేకుండా వసతులు కల్పించామని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు