వెంకటాపూర్ లో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్

వెంకటాపూర్ లో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్

 జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డి హాజరు
 ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి అధ్యక్షతన ప్రజా గోస - బీజేపీ భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్ట్రీట్ కార్నర్  సమావేశాలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జి మోహన్ రెడ్డి, పాల్గొని మాట్లాడుతూ రేపటినుండి అన్ని శక్తి కేంద్రాలలో కూడా ఈ మీటింగ్స్ జరుగుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాల పేరిట యువతను  నిరుద్యోగ భృతి పేరిట  మోసం చేసిందని అధిక కరెంట్ చార్జీలు వసూలు చేస్తుందని ఆరోపించారు.

ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటుందని దుయ్యబట్టారు. బి ఆరె ఎస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని కొనియాడారు. శక్తి కేంద్రాలు, బూత్ ల వారిగా ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేయాలని కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెడిశేట్టి బాలయ్య, కిరణ్ నాయక్,గుర్రాల రాజు, గడ్డం రవి, పూర్ణచందర్, శ్రీకాంత్, గెంటి రవి,రమేష్,సన్నీ ధనాల దేవయ్య, కిషన్, సురేష్,గోపి,సురేష్, శ్రావణ్,శేఖర్, బూత్ నాయకులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.