ఆర్టీసీ కార్మికుల సంబరాలు కెసిఆర్ కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం

ఆర్టీసీ కార్మికుల సంబరాలు కెసిఆర్ కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో ముందు కార్మికులు సంబరాలు నిర్వహించుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం పై వర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 50 వేల కుటుంబాలు ప్రభుత్వానికి అండగా ఉంటామని ఆర్టీసీ యూనియన్ నాయకులు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. నాయకులు తోట ఆగయ్య జిందం చక్రపాణి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.