బహుజన కార్యకర్తల ముఖ్య సమావేశం

బహుజన కార్యకర్తల ముఖ్య సమావేశం

ముద్ర,తంగళ్ళపల్లి:-బహుజన సమాజ్ పార్టీ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఈనెల 13 గురువారం రోజున సిరిసిల్ల పట్టణ కేంద్రంలో నిర్వహించనున్న సందర్భంగా సన్నాహక సమావేశాలలో భాగంగా తంగళ్ళపల్లి మండలం పద్మా నగర్ లో నేడు ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.మండల ఇంచార్జ్ గుండు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు లింగంపల్లి మధుకర్ హాజరయ్యారు.అనంతరం తాను మాట్లాడుతూ ఎన్నికల పేరుతో ఉన్నత వర్గాల ఆధీనంలోనికి రాజకీయ పార్టీలను తీసుకుంటున్నారని బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలు గానే పరిగణిస్తున్న బీజేపి,కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ చదరంగంతో  బహుజనులైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను రాజ్యాధికారం అనే ఆలోచనకు దూరం చేస్తున్నాయని ఇకనైనా బహుజన వర్గాల్లోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువత, విద్యార్థులు,విద్యావంతులు, మహిళలు,రాజకీయంగా జాగృతం కావాలని పిలుపునిచ్చారు.డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  బహుజన్ సమాజ్ పార్టీతో ముందుకు వస్తున్నారనే విషయం గమనించి మహానీయుల త్యాగాల పునాదులపై నిర్మించబడిన బహుజన సమాజ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలపరిచేందుకు ఇకనైనా మేల్కోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు మెర్గు రాజు,సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తడక భాను ఉపాధ్యక్షులు,చిట్టిపెళ్లి నరేందర్,మండల కార్యనిర్వాహక కమిటీ సభ్యులు వంతడ్పుల కిషన్ , సగ్గుపాటి శంకర్,మెరుగు భాస్కర్,వెలగొండ కృష్ణ మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు.