సిపిఎం అధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా

సిపిఎం అధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా

ముద్ర సిరిసిల్ల టౌన్: అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ జిల్లా శాఖ అధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూశం రమేష్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని అలాగే డబుల్ బెడ్ రూమ్ లు వచ్చిన అనర్హులను గుర్తించి వెంటనే అవి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం లో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య నిర్లక్ష్య దోరణి వీడి పేద ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు.  పట్టణం లోని ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి ఇంటి నిర్మాణం కొరకు వెంటనే మూడు లక్షల రూపాయలు మంజూరీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.