దళిత బంధు తో సుస్థిర జీవనోపాధి...

దళిత బంధు తో సుస్థిర జీవనోపాధి...
  • సంక్షేమ పథకాల అమలులో దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది..
  • ప్రభుత్వం చిన్న వ్యాపారులకు చేయూతనిస్తుంది...
  • వ్యవసాయ కాలేజీలో  బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ...
  • మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:దేశంలొ ఎక్కడా లేని విధంగాసీఎం కేసిఆర్ దళితులను ధనికులు గా చేసేందుకు దళిత బంధు కార్యక్రమం చేపట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారంరాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్,రాష్ట్ర ఎస్సీ,గిరిజన,బిసీ,మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి పర్యటించారు.భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ళ వ్యవసాయ కాలేజీ లో బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి,నివాళులు అర్పించారు.అనంతరంజిల్లా ఐడీవోసి  ఆవరణలో దళిత బంధు పథకం క్రింద మంజూరైన  రెండు మునిసిపల్ సెప్టిక్ ట్యాంక్, బస్సు యూనిట్ లను ప్రారంభించి,ఐడీవోసి కార్యాలయంలోని కాన్ఫరెన్స్  హాల్ లో 128 చిన్న తరహా వ్యాపార ఎస్సీ లబ్ధిదారులకు  ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా మంత్రి  కేటీఆర్ మాట్లాడుతూ కుటీర వ్యాపార పథకం క్రింద 128 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు.దళిత బంధు పథకం ఫలితాలు అందుతుంటే సంతోషం వేస్తుందనీ,రెండో విడతలో నియోజకవర్గంకు 1100 చొప్పున యూనిట్ లు పంపిణీ చేస్తామన్నారు.దళిత సమాజంలో పరివర్తన కృషి చేస్తున్నామని,దళిత బంధు మొదటి విడతలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుస్థిర జీవనోపాధి లబ్ధిదారులు పొందేలా యూనిట్ లను మంజూరు చేశామన్నారు.సంపద సృష్టించే లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో దళిత బంధు యూనిట్ లు గ్రౌండింగ్ చేశామని, ఇందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని అన్నారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణాన్ని రూపురేఖలు మార్చి,అభివృద్ధి అంటే ఇట్లా ఉంటాడని చూపిన వ్యక్తి మంత్రి కేటీఆర్ అని కొనియాడారు.ముఖ్యమంత్రి అన్ని వర్గాలు బాగుండాలని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని,సంక్షేమ పథకాలలో దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నదన్నారు.వ్యవసాయం,విద్య,వైద్యం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని,దళితులు దళిత బంధు ద్వారా ధనికులు అయ్యారన్నారు. ఇప్పటి వరకూ 40వేల మందికి దళిత బందు పథకం క్రింద యూనిట్ లు గ్రౌండ్ అయ్యాయని, వీటిలో 98 శాతం యూనిట్ లు సక్సెస్ అయ్యాయని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల మంది దళిత కుటుంబాలకు దశల వారీగా దళిత బంధు వస్తదని అన్నారు..75 సంవత్సరాలలో దళితులను పట్టించుకున్న నాథుడే లేడని,తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులలో చైతన్యం వచ్చిందని,ఎస్సీ కార్పొరేషన్ లోన్ లలో 60 శాతం సబ్సిడీ ఇచ్చిన ఘనత కెసిఆర్ దేనన్నారు.చిన్న వ్యాపారులను ఆదుకోవాలని 50వేల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని,దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణ,వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు,రాష్ట్ర టెక్స్టైల్,పవర్లూం చైర్మెన్ ప్రవీణ్,సెస్ చైర్మెన్ రామారావు,గ్రంధాలయ శాఖ చైర్మెన్ శంకరయ్య,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నర్సయ్య,సిరిసిల్ల,వేములవాడ మున్సిపల్ చైర్మన్లు కళ,మాధవి, కలెక్టర్ అనురాగ్ జయంతి,జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్,ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు